గల్లీల్లో జనాల అవస్థలు .. ఢిల్లీలో టీఆర్ఎస్ సంబురాలు

గల్లీల్లో జనాల అవస్థలు .. ఢిల్లీలో  టీఆర్ఎస్ సంబురాలు

వరదలతో  హైదరాబాద్ గల్లీల్లో జనాలు ఇబ్బంది పడుతుంటే టీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో సంబురాలు చేసుకుంటున్నారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. దళితులకు ఇవ్వడానికి భూములు లేవంటూనే ఎలా వేలం వేస్తున్నారని ప్రశ్నించారు. ఇళ్ల  స్థలాలు లేవంటూనే.. వేల ఎకరాలు వేలం వేస్తుందన్నారు. టీఆరెఎస్ ను గద్దె దించాలన్నారు. రాష్ట్రం భూముల్ని.. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటుందన్నారు. దళితులకు సీఎం పదవి ఇవ్వకుండా.. వరంగల్ నుంచి ఇద్దరు దళితులకు డిప్యూటీ సీఎం ఇచ్చిన కేసీఆర్.. మళ్లీ గుంజుకున్నాడన్నారు. ఏ ప్రభుత్వమైనా  పథకాలను రాష్ట్రవ్యాప్తంగా, అందరికి అమలు చేస్తది కానీ.. దళిత బంధు హుజురాబాద్ ఎన్నిక కోసమే అన్నట్లు సర్కార్ వ్యవహరిస్తోందన్నారు. దళితబంధు  119 నియోజకవర్గాల్లో అమలు చేయాలన్నారు.