రైతు భరోసా యాత్రలో భాగంగా నాలుగోరోజు నాగర్ కర్నూల్ జిల్లాలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది. అయితే నాలుగోరోజు పాదయాత్ర మొదలుకావడానికి ముందు ఆయనను ములుగు ఎమ్మెల్యే సీతక్క కలిశారు. ఆయనకు సీతక్క పెయిన్ రిలీఫ్ ఇచ్చే కొత్త చెప్పులను గిఫ్ట్గా ఇచ్చారు. వాటిని వేసుకొని చూసిన రేవంత్ రెడ్డి.. చెప్పులు బాగున్నాయన్నారు. కేంద్రం తెచ్చిన అగ్రిచట్టాలకు వ్యతిరేకంగా ఎంపీ రేవంత్ రెడ్డి ఈ రాజీవ్ రైతు భరోసా పాదయాత్రను మొదలుపెట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీల్చే కుట్ర జరుగుతోందని ఆమె మండిపడ్డారు.
A small gift to my Brother @revanth_anumula ✊?
Pain relief slippers.
Day 4 of Rajiv Raithu Bharosa Padayatra✊?@RahulGandhi @priyankagandhi @MahilaCongress @kumari_selja @manickamtagore @sushmitadevinc #FarmersProtest #RahulGandhi #KisanAndolan #RajivRaithuBharosaPadayatra pic.twitter.com/etIlTm2NQI— Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) February 10, 2021
For More News..