పక్కపక్కనే రాజయ్య, కడియం.. షేక్ హ్యాండ్ ఇచ్చుకొని మరీ

పక్కపక్కనే రాజయ్య, కడియం.. షేక్ హ్యాండ్ ఇచ్చుకొని మరీ

నిన్నటి వరకు ఉప్పు..నిప్పులా ఉన్న ఎమ్మెల్యే తాటి కొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కలిసిపోయారు. స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ కోసం బహిరంగంగా  విమర్శలు చేసుకున్న ఈ ఇద్దరు..ఇప్పుడు ఒక్కటయ్యారు. పక్క పక్కనే కుర్చోని మరీ కబుర్లు చెప్పుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకుని కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఈ ఆసక్తికర సన్నివేశానికి జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి సీతారాముల ఆలయం పున: ప్రతిష్ట కార్యక్రమం వేదికైంది. 

జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి సీతారాముల ఆలయం పున: ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు స్టేషన్ ఘన్ పూర్  ఎమ్మెల్యే తాటికొండ రాజయ్,  ఎమ్మెల్సీ కడియం శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై కుర్చీలు వేశారు. అటు పక్కన మంత్రి సత్యవతి..ఇటు పక్కన మరో కుర్చీలో మరో నాయకుడు కూర్చున్నారు. మధ్యలో రెండు సీట్లు మాత్రమే  ఖాళీగా ఉన్నాయి. దీంతో  పక్క పక్కనే ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కూర్చున్నారు. ఆత్మీయంగా పలుకరించుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. కుశల ప్రశ్నలు వేసుకున్నారు. రాజయ్య, కడియం శ్రీహరిని చూసిన అక్కడి బీఆర్ఎస్ నేతలు..వీరిద్దరిని ఆసక్తిగా చూశారు. 

ఏమైందో ఏమో కానీ..కొద్ది సేపటి తర్వాత ఎమ్మెల్యే రాజయ్యకు ఒక్కసారిగా తన కుర్చీలో నుంచి లేచి వెళ్లిపోయారు. ఇటీవలి కాలంలో కడియం, రాజయ్యల మధ్య పెద్ద ఎత్తున విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగాయి.  ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఇలా కలవడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.