మనల్ని కాదని సర్కార్ నడుస్తదా.?: ఎమ్మెల్యే తలసాని

మనల్ని కాదని సర్కార్ నడుస్తదా.?: ఎమ్మెల్యే తలసాని

సికింద్రాబాద్, వెలుగు: పనులు చేయాలని లోక్​సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని పరుగులు పెట్టిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సనత్ నగర్ నియోజకవర్గ సర్వసభ్య సమావేశం గురువారం సికింద్రాబాద్ ప్యాట్నీలోని ఎస్వీఐటీ కాలేజీలో జరిగింది. దీనికి బీఆర్ఎస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ తో కలిసి తలసాని హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘గవర్నమెంట్ మారిందని క్యాడర్ ​సైలెంట్​గా ఉన్నదా? హైదరాబాద్ గవర్నమెంట్ మనది.. మనల్ని కాదని హైదరాబాద్​లో గవర్నమెంట్ నడుస్తదా? ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండొచ్చు.. పోవచ్చు.. సనత్​నగర్​లో శ్రీనివాస్ యాదవ్​మాత్రం శాశ్వతంగా ఉంటాడు” అని అన్నారు. కాంగ్రెస్ అమలుకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని, అభివృద్ధిని పక్కనపెట్టి డ్రామాలు చేస్తున్నదని మండిపడ్డారు.