
నకిరేకల్, వెలుగు : ఎమ్మెల్యే వేముల వీరేశం జన్మదినం సందర్భంగా ఆదివారం నియెజకవర్గ కేంద్రంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి మెయిన్ సెంటర్ వరకు భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు. యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యూఐ ఆధ్వర్యంలో రక్తదానం చేశారు.
ఎమ్మెల్యే తనయుడు వేముల విపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా వేములాస్ కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, షటిల్ టోర్నమెంట్ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. వేలాదిమందికి అన్నదానం చేశారు. ఎమ్మెల్యే కూతురు వేముల వినూత్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య, మున్సిపల్ చైర్మన్ చెవుగోని రజితా శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల-మాధవ్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్వర్లు, స్థానిక కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.