
కావాలనే కొందరు బీజేపీ నాయకులు తనపై బురద జల్లుతున్నారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. తాను ఏ రోజూ కూడా మంత్రి పదవి కావాలని కోరలేదన్నారు. చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులతో మాట్లాడానని చెప్పారు.నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నానని తెలిపారు.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని నక్కలపల్లి లోతు వాగు వంతెనను పరిశీలించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీ వరద రావడంతో వాగువంతెన కొట్టుకు పోయింది. దీంతో మండలంలోని నక్కలపల్లి, రాజారాం, ఎదుల బంధం గ్రామాలకు అటవీ శాఖ అనుమతులు లేక రోడ్లు, వంతెన పనులు నిలిచిపోయాయి. దీంతో ఆర్ అండ్ బీ అధికారులు, అటవీశాఖ అధికారులతో మాట్లాడి పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు వివేక్ వెంకటస్వామి. 13 లక్షల రూపాయల అంచనా నిధులతో జూలై 22 వరకు వంతెన మరమ్మతు పనులనుప్రారంభిస్తామన్నారు ఎమ్మెల్యే వివేక్ . బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లి వెళ్లి కేంద్రం నుండి అటవీ అనుమతులు తీసుకురావాలని సవాల్ విసిరారు.