కేసీఆర్ పాలనలో స్వర్ణయుగం: ఎమ్మెల్సీ కవిత

కేసీఆర్ పాలనలో స్వర్ణయుగం: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, వెలుగు: దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ వన్ స్థానంలో నిలిచిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్​ పాలనలో రాష్ట్రం స్వర్ణయుగంగా మారిందన్నారు. లండన్ పర్యటనలో భాగంగా నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమిని అసోసియేషన్ – యూకే (ఎన్ఐఎస్ఏయూ) సభ్యులతో కవిత చిట్​చాట్ చేశారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే సకల జనుల సర్వే చేసి ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల వివరాలు సేకరించామన్నారు. ప్రజలను అభివృద్ధి పర్చడంలో ఈ వివరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. కుల వృత్తుల వారికి సీఎం అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నారని వివరించారు. దళితబంధుతో ఆ వర్గాల్లో ఆర్థిక శక్తి పెరిగిందని చెప్పారు.