మహిళా బిల్లుతో ఎవరికీ నష్టం లేదు: ఎమ్మెల్సీ కవిత

మహిళా బిల్లుతో ఎవరికీ నష్టం లేదు: ఎమ్మెల్సీ కవిత

మహిళా రిజర్వేషన్ బిల్లుతో ఎవరికీ నష్టం లేదని.. పార్లమెంట్ లో బిల్లు పెట్టి బీజేపీ చిత్తశుద్ధిని నెరవేర్చుకోవాలని ఎమ్మెల్సీ కవిత హితవు పలికారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో ఆమె ఇవాళ సాయంత్రం ఢిల్లీ సమావేశమైయారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత..10వ తేదీన జంతర్ మంతర్ లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చేపట్టే దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఏచూరిని ఆహ్వానించామన్నారు. దేశంలో ఉన్న పరిస్థితులు, మహిళా రిజర్వేషన్ బిల్లు రావాల్సిన ఆవశ్యకతపై చర్చించామన్నారు. 1996లో దేవగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో మొట్టమొదట మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టారని.. దేవగౌడ తర్వాత వచ్చిన ప్రతి ప్రధానమంత్రి మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ప్రధానమంత్రి మోడీ వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా బిల్లు ప్రవేశపెట్టే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు.

వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నామని కవిత వెల్లడించారు. 18 పార్టీలకు చెందిన నేతల ప్రతినిధులు దీక్ష హాజరుకానున్నారని తెలిపారు. కాలేజ్, యూనివర్సిటీలో బిల్లు యొక్క ప్రాముఖ్యత వివరిస్తామని ఆమె చెప్పారు. మహిళా బిల్లు వల్ల ఎవరికీ నష్టం లేదని అన్న కవిత..బిల్లు పెట్టి బీజేపీ చిత్తశుద్ధి నెరవేర్చుకోవాలని హితవు పలికారు. బీజేపీ హైదరాబాద్ లో దీక్ష చేపడుతుంది అంటే ఢిల్లీలో తన దీక్ష సక్సెస్ అయ్యనట్టే కదా అని వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యేలా బండి సంజయ్, కిషన్ రెడ్డి చూడాలని సూచించారు.

2023 మార్చి 2వ తేదీన తాను దీక్ష చేస్తానని ప్రకటించానని..9 వతేదీన ఢిల్లీకి రావాలని ఈడీ నోటీసులు ఇచ్చిందన్నారు ఎమ్మెల్సీ కవిత. తాను 11 వతేదీ వస్తాను ఢిల్లీకి వస్తానని ఈడీ తెలియజేశానని చెప్పారామె. బి.ఎల్ సంతోష్ కూడా సిట్ విచారణకు హాజరు కావలసి ఉండే కోర్టుకు వెళ్లి మరీ స్టే  తెచ్చుకున్నారని గుర్తు చేశారు. ఈడీ ప్రశ్నలకు తాను సమాధానం ఇస్తాను..వెళ్లాల్సిన టైంకు కోర్టుకు వెళ్తానని కవిత పేర్కొన్నారు.