ఢిల్లీకి చేరుకున్న ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీకి చేరుకున్న ఎమ్మెల్సీ కవిత

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీకి చేరుకున్నారు. ఇటీవల జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లుపై నిరాహార దీక్ష చేపట్టిన ఆమె.. దానికి కొనసాగింపుగా ఇయ్యాళ (మార్చి 15న) రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొననున్నారు. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్​ల బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ భారత జాగృతి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు ఢిల్లీలోని లే మెరేడియన్​హోటల్​లో రౌండ్​టేబుల్​సమావేశం ఏర్పాటు చేశారు. ఈ​ సమావేశానికి పలు రాజకీయ పార్టీల నేతలు, మహిళా సంఘాలు, జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న  ఎమ్మెల్సీ కవితను మార్చి16న ఈడీ అధికారులు మరోసారి విచారించనున్నారు. మార్చి 11న దాదాపు 9గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు.. కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును ఈ రోజు విచారించనున్నారు.