
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన ఎమ్మెల్సీ కవితపై లేఖపై ఆమె స్పందించారు.. ఆ లేఖ రాసింది నేను ..అయితే నా తండ్రి, బీఆర్ ఎస్ నేత, మా పార్టీ అధినేతకు రాసిన లేఖ బయటికి రావడం బాధకరమన్నారు. ప్రజలు ఎజెండా,నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పలేదు..నా వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
కేసీఆర్ దేవుడు..అయితే ఆయన చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్లవల్లే నా లేఖ బయటికి వచ్చింది..అంతర్గతంగా నేను రాసిన లేఖ బయటికు రావడంలో కుట్ర ఉందన్నారు కవిత. నా లేఖే బయటికి వచ్చిందంటే పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏంటని కవిత ప్రశ్నించారు.
కేసీఆర్ మా నాయకుడు, కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామన్నారు స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కవిత. పార్టీలో లోపాలను సవరించుకుంటేనే భవిష్యత్ ఉంటుందన్నారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వైఫల్యం చెందాయి.. ఆ రెండు పార్టీలకు కేసీఆరే ప్రత్యామ్నాయం అన్నారు.