నాగిరెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి

నాగిరెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లి గ్రామాన్ని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి దత్తత తీసుకున్నారు. నాగిరెడ్డి పల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తమ గ్రామాన్ని పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి దత్తత తీసుకోవడంపై గ్రామస్తులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.  ఈ మేరకు  పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. 

నాగిరెడ్డి పల్లిలో సమస్యలపై ఆ గ్రామానికి చెందిన 200 మంది ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను శ్రీనివాస్ రెడ్డికి వివరించారు. దీంతో వెంటనే స్పందించిన శ్రీనివాస్ రెడ్డి నాగిరెడ్డి పల్లి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

నాగిరెడ్డిపల్లిని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి..కొన్నె -నాగిరెడ్డిపల్లి రోడ్ తాత్కాలిక మరమ్మత్తు కోసం 5 లక్షలు శాంక్షన్ చేస్తున్నట్లుగా తెలిపారు. మహిళల స్వయం ఉపాధి కోసం తన  సొంత డబ్బులతో 2 రోజుల్లో కుట్టు మిషన్ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లుగా చెప్పారు.