17 వరకు పలు రూట్లలో ..ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

17 వరకు పలు రూట్లలో ..ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

సికింద్రాబాద్, వెలుగు: ట్రాక్ మెయింటెనెన్స్ పనుల కారణంగా ఈ నెల 17వ తేదీ వరకు ఆయా రూట్లలో ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. 15 వరకు లింగంపల్లి-- – హైదరాబాద్, 16 వరకు ఫలక్ నుమా– సనత్ నగర్, 17 వరకు ఉందానగర్–- లింగంపల్లి, -ఫలక్​నుమా–- లింగంపల్లి స్టేషన్ల మధ్య నడిచే ఎంఎంటీఎస్ ​రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు గమనించి ఆయా తేదీల్లో ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.