డ్రగ్స్ కేసు: నలుగురు హీరోయిన్ల ఫోన్లు సీజ్

డ్రగ్స్ కేసు: నలుగురు హీరోయిన్ల ఫోన్లు సీజ్

ముంబై: డ్రగ్స్ కేసులో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్‌‌తోపాటు రకుల్ ప్రీత్ సింగ్ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలసిందే. శనివారం నిర్వహించిన ఇన్వెస్టిగేషన్‌‌లో వీరు పాల్గొన్నారు. తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం.. దీపికా పదుకొనె, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ మొబైల్ ఫోన్లను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. శనివారం దీపికను ఆరు గంటల పాటు ఎన్సీబీ ప్రశ్నించింది. టేలెంట్ మేనేజర్ జయా సాహా, ఫ్యాషన్ డిజైనర్ సిమోన్ ఖంబట్టా ఫోన్లను కూడా ఎన్సీబీ సీజ్ చేసింది. డ్రగ్స్ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునేందుకే ఈ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నలుగురు హీరోయిన్ల స్టేట్‌‌మెంట్స్‌‌‌ను రికార్డు చేసినట్లు అధికారులు చెప్పారు.