హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2023–24 అకడమిక్ ఇయర్ కు సంబంధించి మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు నేటినుంచి స్వీకరించనున్నారు. మంగళవారం నుంచి దరఖాస్తులను తీసుకుంటామని మోడల్ స్కూల్స్ స్టేట్ అడిషనల్ డైరెక్టర్ రమణకుమార్ తెలిపారు.
194 స్కూళ్లలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులున్నాయనీ, ఒక్కోగ్రూపులో 40 సీట్లుంటాయనీ చెప్పారు. ఈనెల16 నుంచి 25 వరకూ కాలేజీకి వెళ్లి అప్లై చేయొచ్చనీ లేదంటే ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఇతర వివరాలు మోడల్ స్కూల్ వెబ్ సైట్ https://telanganams.cgg.gov.in ద్వారా తెలుసుకోవచ్చన్నారు.