ఖాట్మండ్: నేపాల్ లో స్వల్ప భూకంపం సంభవించింది. డోలఖా జిల్లాలో మంగళవారం రాత్రి 11: 53 గంటల సమయంలో భూప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత తో ప్రకంపనలు నమోదైనట్లు నేపాల్ లోని నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. భూకంపంతో కొంతమేరకు ఆస్తినష్టం జరిగినప్పటికీ.. ప్రాణ నష్టం జరగలేదని ప్రకటించింది.
హిమాలయన్ సరిహద్దు దేశమైన నేపాల్ ను తరచూ భూకంపాలు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయనే విషయం తెలిసిందే. మరోవైపు పసిఫిక్ మహాసముద్రంలోని సాంటా క్రూజ్ ఐలాండ్స్ లో మంగళవారం 6.5 తీవ్రతతో భూకంపం నమోదైందని స్థానిక భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది.