తెలంగాణకు మోదీ ఇచ్చింది గాడిద గుడ్డు : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణకు మోదీ ఇచ్చింది గాడిద గుడ్డు : సీఎం రేవంత్ రెడ్డి

ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లు ప్రధానిగా ఉండి తెలంగాణకు మోదీ ఇచ్చందేమి లేదన్నారు. తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారని విమర్శించారు. కర్ణాటకకు చెంబు, ఏపీకి మట్టి, చెంబడు నీళ్లు, తెలంగాణకు గాడిద గుడ్డు ఇవే మోదీ పదేళ్లలో ఇచ్చారని విమర్శించారు. 2014 లో సోనియమ్మ తెలంగాణకు ఇచ్చిన హామీలను మోదీ అమలు చేయలేదని ఆరోపించారు. 

కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో కాంగ్రెస్ పార్టీ జన జాతర సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిని సంపి బిడ్డను బతికించారని మోదీ పార్లమెంట్ సాక్షిగా అన్నారని.. నరేంద్ర మోదీ తెలంగాణను అవమానించినప్పుడు బండి ఎందుకు మౌనంగాఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు నిజామాబాద్ గుండు, కరీంనగర్ అరగుండు చేసిందేమి లేదని విమర్శించారు. 

ఇప్పుడు వచ్చి మాయమాటలతో తెలంగాణను ఆక్రమించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ చేతిలో కరీంనగర్, పాలమూరు జిల్లాలు బందీ అయ్యాయని విమర్శించారు. సెమీ ఫైనల్స్ లో కేసీఆర్ ను ఓడించినట్టు ఫైనల్స్ లో బీజేపీ, నరేంద్ర మోదీని ఓడించాలని కోరారు.