
మెహిదీపట్నం, వెలుగు: దివ్యాంగుల కోసం కేంద్రం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఉచితంగా పంపిణీ చేసే బ్యాటరీ ట్రై సైకిళ్ల పంపిణీ నమోదు కార్యక్రమం మాసబ్ ట్యాంక్లోని బంజారా ఫంక్షన్హాల్లో జరిగింది.
చీఫ్ గెస్టుగా హాజరైన లక్ష్మణ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం తీసుకురానున్న పథకాల గురించి వివరించారు. ఇప్పటికే కేంద్రం దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్లు ప్రకటించిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు గౌతమ్ రావు, ముఖేశ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.