ఎగ్జామ్ పేపర్ లీక్ చేస్తే.. పదేళ్లు జైలు,రూ.10కోట్ల జరిమానా

ఎగ్జామ్ పేపర్ లీక్ చేస్తే.. పదేళ్లు జైలు,రూ.10కోట్ల జరిమానా

నీట్ పేపర్ లీక్​ వివాదంపై ఢిల్లీలో నిరసనలు కొనసాగుతున్న క్రమంలో పరీక్షల మోసాలను అరికట్టేందుకు కేంద్రం  కఠిన చర్యలకు సిద్దమవుతోంది. పేపర్​ లీకులను అడ్డుకునేందుకు కొత్త చట్టం తీసుకురానుంది. శుక్రవారం (జూలై 24)  జరిగిన కేంద్ర కేబినెట్​ మీటింగ్​లో పేపర్​ లీక్​ నిరోధక ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు చట్టం అయితే పేపర్​ లీక్​ చేసినవారిపై కఠిన శిక్షలు అమలు చేయనున్నారు. ముసాయిదా బిల్లు ప్రకారం.. పేపర్​లీక్​ కేసులను మూడు నెలల్లో పరిష్కరించి దోషులుగా తేలితే పదేళ్లు జైలు శిక్ష, 10కోట్ల రూపాయల జరిమానా విధించేందుకు ప్రతిపాదించారు. 

ఈ ప్రతిపాదిత చట్టం ప్రకారం.. పేపర్​ లీక్​ కేసులను మూడు నెలల్లోనే పరిష్కరించేలా ఓ ఫాస్ట్​ ట్రాక్​ కోర్టు ఏర్పాటు చేయనున్నారు. తక్షణ న్యాయం, ఎగ్జామ్​ నిర్వహణ వ్యవస్థపై నమ్మకాన్న బలోపేతం చేయడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశమని కేబినెట్ తెలిపింది.

పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా..  

ప్రతిపాదిత చట్టంలో పేపర్ లీక్ రాకెట్లతో సంబంధం ఉన్న వారికి కఠినమైన శిక్షలు అమలు చేయనున్నారు. ఈ కొత్త చట్టం కింద దోషులుగా తేలిన వారికి పదేళ్ళ వరకు జైలు శిక్ష పడవచ్చు. అదనంగా, రూ. 10 కోట్ల వరకు జరిమానాను ప్రతిపాదించారు. 

ALSO READ : కేబినెట్ సమావేశంలో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రధాని మోదీ.. అవేంటంటే..

నీట్​ పేపర్ లీక్‌పై దేశవ్యాప్తంగా ఆందోళనలు 

నీట్-యూజీ పేపర్ లీక్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్రమవుతున్న క్రమంలో ఈ బిల్లును తీసుకొచ్చారు. పరీక్షల నిర్వహణలో మరింత జవాబుదారీతనం, సంస్కరణలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు భద్రతకు,కాంపిటిటివ్​ ఎగ్జామ్స్​సమగ్రతకు భంగం కలిగించే బాధ్యులకు కఠిన శిక్షలు పడేలా చేసేందుకుఉ తాము కట్టుబడి ఉన్నామని కేంద్ర ప్రభుత్వం  స్పష్టం చేసింది.ఆమోదం పొందిన బిల్లున వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదిస్తామని తెలిపింది.