మోదీ ధనవంతుల కోసం, కేసీఆర్ కాంట్రాక్టర్ల కోసం పని చేశారు : వివేక్ వెంకటస్వామి

మోదీ ధనవంతుల కోసం, కేసీఆర్ కాంట్రాక్టర్ల కోసం పని చేశారు : వివేక్ వెంకటస్వామి

ప్రధాని మోదీపై విమర్శలు చేశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే  రూ.15 లక్షల ప్రతి పేదవాడి బ్యాంక్  ఖాతాలో వేస్తానని చెప్పి నరేంద్ర మోడీ మర్చిపోయారని విమర్శించారు. మంచిర్యాల జిల్లా రామక్రిష్ణపూర్ లోని సూపర్ బజార్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ నరేంద్రమోదీ ధనవంతుల కోసం, కేసీఆర్ కాంట్రాక్టర్ల కోసంపని చేస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజల సంక్షేమం కోసం పని చేస్తుందని తెలిపారు. 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో సింగరేణిలో ఒక్క కొత్త గనిని తీసుకురాలేదని విమర్శించారు. గడ్డం వంశీ కృష్ణ గెలిపిస్తే సింగరేణిలో కొత్త గనులు వచ్చేలా కృషి చేస్తారని తెలిపారు. కేంద్రంలోనూ కాంగ్రెస్ వస్తే రాష్ట్రానికి మరిన్ని నిధులు వస్తాయని తెలిపారు వివేక్ వెంకటస్వామి.