ఓటుకు నోటు కేసులో బాబు పారిపోయారు: మోహన్ బాబు

ఓటుకు నోటు కేసులో బాబు పారిపోయారు: మోహన్ బాబు

తిరుపతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో ఓడిపోతారని అన్నారు సినీ నటుడు మోహన్ బాబు. తిరుపతిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన కరుణాకరణ్‌రెడ్డి మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో ఆయన టీడీపీ పాలనపై విమర్శలు చేశారు. “విద్యాసంస్థలు పెట్టి.. నాణ్యమైన చదువులు చెప్పి మాత్రమే మేం డబ్బులు సంపాదించాం. అక్రమంగా నయాపైసా కూడబెట్టలేదు. జగన్ పై విమర్శలు చేసేముందు చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకోవాలి. ఓటుకు నోటు కేసులో పారిపోయింది చంద్రబాబే. మామను మోసం చేసి టీడీపీని చెప్పుచేతల్లోకి తీసుకున్నాడు. చంద్రబాబుకు విలువలు లేవు. ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ గెలిచి.. ముఖ్యమంత్రి కావడం ఖాయం” అని చెప్పారు మంచు మోహన్ బాబు.