మోహన్ బాబు ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

మోహన్ బాబు ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

సినీ నటుడు, శ్రీ విద్యానికేతన్.. సంస్థల అధినేత మోహన్ బాబు చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. 19 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్  బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. విద్యార్థులతో కలిసి ప్లకార్డులతో నిరసన తెలిపారు మోహన్ బాబు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని మోహన్ బాబుకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా..  తన విద్యాసంస్థ ఎదుటే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని వెంటనే ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు మోహన్ బాబు.