షారుఖ్ ఖాన్ కొడుకు డ్రగ్స్ కేసుతో మోహిత్ కు లింకులు

షారుఖ్ ఖాన్ కొడుకు డ్రగ్స్ కేసుతో మోహిత్ కు లింకులు

డ్రగ్స్ కేసులో పట్టుపడ్డ మోహిత్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలను పోలీసులు బయటపెట్టారు.  షారుఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్  డ్రగ్స్ కేసులో మోహిత్ ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ముంబై క్రూజ్ లో మైరాన్ రోహిత్ డీజే పార్టీ నిర్వహించినట్లు చెప్పారు. ముంబై, గోవాలోని ప్రముఖ పబ్బులకు మైరాన్ మోహిత్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించామన్నారు పోలీసులు. హైదారాబాద్ లో పబ్ ఓనర్స్ తో మోహిత్ కు సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. పబ్ ఓనర్స్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  గోవా నుంచి స్లీపర్ కోచ్ బస్సుల ద్వారా.. రోహిత్ హైదరాబాద్ కు తెప్పిస్తున్నట్లు గుర్తించామన్నారు. 50 మంది డ్రగ్స్ ఫెడ్లర్స్ తో మోహిత్ కు సంబంధాలు ఉన్నాయన్నారు.

వ్యాపారవేత్త కృష్ణ కిషోర్ రెడ్డి అరెస్టుతో డ్రగ్స్ దందాలో కొత్త లింకులు బయటపడ్డాయి. 2019లో బయటపడ్డ ఎక్సైజ్ డ్రగ్స్ కేసులో కృష్ణ కిషోర్ పాత్ర ఉందని.. ఆ కేసులో కౌన్సిలింగ్ కు కృష్ణ కిషోర్ రెడ్డి హాజరయ్యారు . న్యూఇయర్ సందర్భంగా పెద్దఎత్తున హైదరాబాద్ కి డ్రగ్స్ తెస్తున్నారన్న సమాచారంతో.. మోహిత్ తో పాటు మరో కృష్ణ కిషోర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూఇయర్ సెలబ్రేషన్స్ టార్గెట్ గా డ్రగ్స్ సప్లై చేసినట్లు గుర్తించారు. డ్రగ్స్ కింగ్ పిన్ ఎడ్విన్ తో మోహిత్ కు సంబంధాలున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.