
ముషీరాబాద్/సికింద్రాబాద్/సీతాఫల్ మండి/మూసాపేట/ తుక్కుగూడ, వెలుగు: సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ పై చర్యలు తీసుకోవాలంటూ సోమవారం గ్రేటర్వ్యాప్తంగా బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. చిలకలగూడ గాంధీ విగ్రహం వద్ద సికింద్రాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి ఆధ్వర్యంలో నేతలు నిరసన తెలిపారు. మాజీ మేయర్, బీజేపీ నాయకురాలు బండ కార్తీక రెడ్డి హాజరై మద్దతు తెలిపారు.
రాంనగర్ చౌరస్తాలో బీజేపీ, బీజేవైఎం, మహిళా మోర్చా నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. ఉదయనిధిని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా తుక్కగూడ మున్సిపాలిటీ పరిధి శ్రీశైలం హైవేపై బీజేపీ మహేశ్వరం సెగ్మెంట్ అందెల శ్రీరాములు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఉదయనిధి దిష్టిబొమ్మను దహనం చేశారు. మూసాపేట డివిజన్ భరత్నగర్ కాలనీలోని హరి హర క్షేత్రం నుంచి బీజేపీ నేత వడ్డేపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం ఉదయనిధి దిష్టిబొమ్మను దహనం చేశారు.