ఏపీలో పోలింగ్ కేంద్రాల దగ్గర డబ్బుల పంపిణీ

ఏపీలో పోలింగ్ కేంద్రాల దగ్గర డబ్బుల పంపిణీ

ఏపీ కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లకు డబ్బులు పంచుతున్నారు ఓ పార్టీ వర్గీయులు. ఓటర్లకు దగ్గరున్న పోల్ స్లిప్పులను చూపిస్తే 2 వేలు, 5 వందల రూపాయలు ఇస్తున్నారు. డబ్బులు తీసుకున్న ఓటర్లు ఎవరికి ఓటేస్తున్నారనో తెలుస్తుందని హెచ్చరిస్తున్నారు.

కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గంలోనూ ఓటర్లకు డబ్బులు పంచుతున్నారు ఓ పార్టీ నేతలు. పోలింగ్ కేంద్రాల దగ్గర బహిరంగంగా డబ్బులు పంచుతూ మీడియాకు చిక్కారు. ఓటర్ల దగ్గర  పోల్ చిట్టీలు చూపిస్తూ…. 500 రూపాయలు ఇస్తున్నారు.