ఎయిడ్స్ పై ఇంకా అవగాహన కల్పించాలి

ఎయిడ్స్ పై ఇంకా అవగాహన కల్పించాలి

ముషీరాబాద్,వెలుగు: హెచ్ఐవీ వ్యాప్తి నిర్మూలనకు ఇంకా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సంయుక్తాధ్వర్యంలో బుధవారం బాగ్ లింగంపల్లిలోని కాకా బీఆర్ అంబేద్కర్ కాలేజీలో ఎయిడ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ పినపాటి ప్రసాద్, కో – ఆర్డినేటర్ ఎం. రమేశ్​ ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. ఎయిడ్స్ నివారణకు అవగాహన పెరగడంతో పాటు వైరస్ ను నిర్మూలించే మందులు అందుబాటులోకి వచ్చినా.. కొన్ని ప్రాంతాల్లో ఇది ఇంకా ప్రబలంగానే ఉందని పేర్కొన్నారు. హెచ్ఐవీ వ్యాప్తి నిర్మూలనకు ఎన్ఎస్ఎస్ వలంటీర్లు అవగాహన ర్యాలీలతో ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ కాలేజీల ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లు, అంబేద్కర్ కాలేజీ  డైరెక్టర్స్, ప్రిన్సిపల్స్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.