వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ టిప్పర్ మూగజీవాలను బలితీసుకుంది. ఖానాపురం మండల పాకాల వాగు వంతెనపై గురువారం అర్ధరాత్రి టిప్పర్ గొర్రెల మందను ఢీకొట్టింది. ఈ ఘటనలో వందకు పైగా గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. పాకాల-వాజేడు అటవీ ప్రాంతంలో గొర్రెల యజమాని తన 600 గొర్రెలు మేపుకొని ఇంటికి వెళ్తుండగా వెనుక నుంచి స్పీడ్ గా మట్టి లోడుతో వచ్చిన టిప్పర్ గొర్రెల మీది నుంచి దూస్కెళ్లింది. ప్రమాదంలో గొర్రెలు మృతి చెందాయి. చనిపోయిన గొర్రెలు టిప్పర్ టైర్ల మధ్య ఇరుక్కుపోవడంతో కదలడానికి కూడా వీలులేక టిప్పర్ ఆగిపోయింది. దీంతో డ్రైవర్ వాహనం వదిలి పారిపోయాడు. సుమారు రూ.18 లక్షల నష్టం జరిగిందని గొర్రెల యజమాని వాపోయాడు. విషయం తెలుసుకున్న ఖానాపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
టిప్పరు ఢీకొని వందకు పైగా గొర్రెలు మృతి
- తెలంగాణం
- January 3, 2020
లేటెస్ట్
- కాటన్ సీడ్ రైతుల గోస .. లూజ్ విత్తనాలపై క్లారిటీ ఇవ్వని ఆఫీసర్లు
- చినుకులు కురిసె.. భూతల్లి పులకించె
- పదేండ్లు నిండా ముంచి.. ఇప్పుడు నీతి వాక్యాలా? : కోదండరెడ్డి
- డర్టీ ఫెలో ఫ్యామిలీ డ్రామా
- దేవాలయ భూములకు జియోట్యాగింగ్
- తీన్మార్ మల్లన్నకు టీజేఎస్ మద్దతు
- చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా రష్మిక మందన్న
- చెరువుల పరిరక్షణపై ప్యానెల్ డిస్కషన్
- మాఫియా డాన్గా మోహన్ లాల్
- అనారోగ్యంతో వెలుగు రిపోర్టర్ మృతి
Most Read News
- ఫోన్ పక్కన పెట్టుకొని పడుకుంటున్నారా.. అయితే ఈ సమస్యలకు స్వాగతం చెప్పినట్టే...
- హైదరాబాద్లో ఒకేసారి ఆరు చోట్ల ACB రైడ్స్
- అదృష్టం అంటే ఇదే : కందిపప్పు కోసం వెళితే.. రూ.4 కోట్ల లాటరీ తగిలింది
- SRH vs KKR: కోల్కతాతో క్వాలిఫయర్ 1.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పులు
- Vastu Tips : వంట గది పెద్దగా ఉండకూడదా.. మెట్ల కింద ఖాళీ మంచిదేనా..!
- రిటైర్డ్ అవుతున్న జడ్జ్ వివాదాస్పద కామెంట్స్
- Naga Chaitanya: అత్యంత ఖరీదైన కారు కొన్న నాగ చైతన్య.. స్పెషాలిటీస్ ఇవే?
- కెమికల్స్తో పండించిన మామిడిపండ్లు తింటున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా.. వాటిని ఎలా గుర్తించాలి....
- Jani Master: చేతకానోడు చెడగొట్టడానికే చూస్తాడు.. బెంగళూరు రేవ్ పార్టీపై జానీ సీరియస్ కామెంట్స్
- Kannappa Teaser: కన్నప్ప టీజర్కు సూపర్ రెస్పాన్స్: మంచు విష్ణు