ఎయిర్ పోర్టులో కోటికి పైగా బంగారం సీజ్

ఎయిర్ పోర్టులో కోటికి పైగా బంగారం సీజ్
  • ఇద్దరు ప్యాసింజర్లు అరెస్ట్

శంషాబాద్, వెలుగు: అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు ప్యాసింజర్లను శంషాబాద్ ఎయిర్​పోర్టు కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. మంగళవారం కువైట్ నుంచి దుబాయ్ మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఓ ప్యాసింజర్ నుంచి 1,225 గ్రాముల బంగారం, కువైట్ నుంచి దోహా మీదుగా వచ్చిన మరో ప్యాసింజర్ నుంచి 500 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

పట్టుబడ్డ బంగారం విలువ సుమారు రూ. కోటి 30 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇద్దరు ప్యాసింజర్లపై కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.