సినీ నటి నయనతార, నటుడు విఘ్నేష్ శివన్ వివాహం అనుకున్న ముహూర్తానికి మహాబలిపురంలో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు పలువురు స్టార్ హీరోలు, దర్శకులు, ఇతరులు హాజరై సందడి చేశారు. అందులో ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీ కాంత్, డైరెక్టర్ మణిరత్నం, బాద్షా షారుఖ్ ఖాన్, బోనీ కపూర్, విజయ్ సేతుపతి, కార్తీ, అట్లీ లాంటి ఎంతో మంది ప్రముఖులు అటెండయై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్స్టార్గా పేరు తెచ్చుకున్న నయనతార, సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పాపులర్ అయిన విఘ్నేష్శివన్ గత 7ఏళ్ల నుంచీ రిలేషన్ షిప్ లో ఉన్న విషయం తెలిసిందే. గత కొంత కాలం నుంచీ వారి ప్రేమ పెళ్లి తిరుపతిలో జరుగుతుందంటూ వార్తలు వచ్చినా.. సమయాభావం కారణంగా వీరు మహాబలిపురాన్ని ఎంచుకున్నట్టు సమాచారం.