యాదాద్రి జిల్లాలో భూ వివాదం.. మహిళలపై దాడి

యాదాద్రి జిల్లాలో భూ వివాదం.. మహిళలపై దాడి

యాదాద్రి భువనగిరి జిల్లా: మోటకొండూర్ మండల కేద్రంలోని ఓ భూ వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బురద పొలంలోనే కర్రలతో ఒక వర్గంపై మరొక వర్గం దాడికి పాల్పడింది. ఈ సంఘటన ఆదివారం మోటకొండూర్ లోని ఓ వ్యవసాయ పొలంలో జరిగింది. సర్వే నెంబర్ 296 విస్తీర్ణం 1-19 కుంటల భూమి నాదంటే నాదంటూ ఘర్షణకు దిగారు. ఆడవాళ్లు అని కూడా చూడకుండా రాడ్లు, కర్రలతో కొట్టడంతో స్థానికంగా ఈ సంఘటన కలకలం రేపింది. అన్యాయంగా ఆడవారిపై దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.