భూమి రిజిస్ట్రేషన్​ చేస్తలేదని తల్లిని చంపిండు

భూమి రిజిస్ట్రేషన్​ చేస్తలేదని తల్లిని చంపిండు

లింగాల, వెలుగు: నాగర్​కర్నూల్​ జిల్లా లింగాల మండలం వల్లభాపూర్ గ్రామానికి చెందిన బండపల్లి తిరుపతి తన తండ్రి పేరు మీద ఉన్న భూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని తల్లితో గొడవపడి ఆమెను హత్య చేశాడు. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం..  గ్రామానికి చెందిన బండపల్లి చిలకమ్మ(54) భర్త పేరుమీద రెండెకరాల 20  గుంటల భూమి ఉంది. రెండేండ్ల కింద అతడు చనిపోయాడు. భర్త పేరిట ఉన్న భూమిని తన పేరుపై మార్చుకునేందుకు  మంగళవారం స్లాట్​ బుక్​ చేసుకొని రిజిస్ట్రేషన్​ చేసుకునేందుకు సిద్ధమైంది. 

విషయం తెలుసుకున్న పెద్ద కొడుకు తిరుపతి తండ్రి పేరు మీద ఉన్న భూమిని తన పేరుపై రిజిస్ట్రేషన్  చేయాలని తల్లితో గొడవ పెట్టుకుని రోకలి బండతో తలపై కొట్టడంతో చిలకమ్మ స్పాట్​లోనే చనిపోయింది. రెండో కొడుకు శ్రీను ఇచ్చిన ఫిర్యాదుతో  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.