భర్త కళ్లెదుటే భార్యపై 17మంది గ్యాంగ్ రేప్

భర్త కళ్లెదుటే భార్యపై 17మంది గ్యాంగ్ రేప్

దేశంలో నిర్భయలాంటి చట్టాలు అమలు చేసిన కామంతో కళ్లు మూసుకుపోయిన కీచకులు మహిళలపై దారుణాలు ఒడిగడుతున్నారు. తాజాగా మార్కెట్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న ఓ వివాహితపై 17 మంది మానవ మృగాలు ఆమె భర్తను బంధించి అతని కళ్లెదుటే అత్యాచారానికి ఒడిగట్టారు.

జార్ఖండ్ డుమ్కా జిల్లా ముఫాసిల్ ప్రాంతంలో దారుణం జరిగింది. మార్కెట్ నుంచి ఓ మహిళ భర్తతో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా మాటువేసిన నిందితులు ఆమె భర్తను చెట్టుకు కట్టేసి బాధితురాలిపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

గ్యాంగ్ రేప్‌ను సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ రెండు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని జార్ఖండ్ డీజీపీకి లేఖ రాశారు. కేసుకు సంబంధించి నివేదిక తయారు చేసి సమర్పించాలని కోరారు.

మరోవైపు ఈ దారుణంపై  ఆర్జేడీ నేత శివానంద్ తివారీ ఆడవారిపై అత్యాచారాలు జరగడానికి అశ్లీల దృశ్యాలు, ఐటమ్ సాంగ్సే కారణమని ఆరోపించారు.