కూతురి ప్రేమ విషయం తెలిసిన ఓ తల్లి..వద్దంటూ వారించింది. నచ్చ చెప్పేందుకు ప్రయత్నించింది. అయినా ఆ కూతురు వినకపోగా ప్రేమించిన వాడితో ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. దీంతో మనస్థాపం చెందిన ఆ తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషాధ ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది.
షామీర్ పేట కొల్తూరు గ్రామానికి చెందిన ములుగు హారిక, అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ ప్రేమించుకున్నారు. పెళ్లికి పెద్దలు ఒప్పుకోరేమోనని భయపడి… ఈనెల 25న ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న హారిక తల్లిదండ్రులు తన కూతురికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.అయినా హారిక మాట వినకపోవడంతో మనస్తాపానికి గురైన తల్లి అనిత, ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని సూసైడ్ కు పాల్పడింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.