ఏపీ ప్రజలు పండగ చేసుకుంటున్నారు

ఏపీ ప్రజలు పండగ చేసుకుంటున్నారు

ఏపీ ప్రజలు దీపావళి పండుగ జరుపుకొంటున్నారని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు అన్నారు. చంద్రబాబు పాలన పోయినందుకు వారు పండుగ జరుపుకొంటున్నారని ఆయన చెప్పారు. చంద్రబాబును బంగాళాఖాతంలో కలిపిన జగన్‌కు అభినందనలని ఆయన అన్నారు. చంద్రబాబు 200 కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టినా లోకేశ్‌ను గెలిపించుకోలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు నైతిక విలువలుంటే అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని, పార్టీ పగ్గాలు నందమూరి కుటుంబానికి అప్పగించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన తరువాత ఈ దుర్మార్గుడు సీఎంగా ఉండొదద్దని ప్రజలు కోరుకున్నారని మోత్కుపల్లి అన్నారు. ఎవరైనైనా వాడుకుని వదిలేసే నీచ సంస్కృతి ఉన్న వ్యక్తి చంద్రబాబు అని, అతని నిజస్వరూపం బయట పడేందుకు 25 సంవత్సరాలు పట్టిందని అన్నారు. రాజ్యసభ సీట్లను చంద్రబాబు ఒక్కొక్క టి వంద కోట్లకు అమ్ముకున్నారన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన బాబు ఆ తర్వాత విజయవాడకు పారిపోయారని చెప్పారు.

తాను ఎన్టీఆర్ ప్రోద్బలంతో రాజకీయల్లోకి వచ్చానని, చంద్రబాబు ఇంటి దగ్గర కాపలాగా కుక్కలా ఉన్న తనను మోసం చేశారన్నారు మోత్కుపల్లి.  తనకు గవర్నర్, రాజ్యసభ పదవీ ఇస్తానని నమ్మబలికి, తెలంగాణలో పార్టీని బతికించు కుండామని అన్నందుకు పార్టీ నుంచి అన్యాయంగా సస్పెండ్ చేశారని మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్ పెట్టిన పార్టీని చంద్రబాబు నాశనం చేశారని మోత్కుపల్లి నరసింహులు అన్నారు. దళితులకు అన్యాయం చేసి, మాలమాదిగలకు మధ్య కొట్లాట పెట్టి.. చివరకు వాళ్ళ ఉసురు తగిలి ఓడిపోయావని చంద్రబాబుని తిట్టిపోశారు. తప్పులు సర్దిది డ్డుకున్నోడే లీడర్ అని.. తప్పుల మీద తప్పులు చేసే వాడు నాయకుడు కాదని మోత్కుపల్లి అన్నారు.