కేసీఆర్​ కుట్రలకుతెలంగాణ ప్రజలు బలి : మోత్కుపల్లి నర్సింహులు

కేసీఆర్​ కుట్రలకుతెలంగాణ ప్రజలు బలి : మోత్కుపల్లి నర్సింహులు
  •     రేవంత్​ జనరంజక పాలన అందిస్తున్నరు : మోత్కుపల్లి 

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి జన రంజక, అద్భుత పాలన అందిస్తున్నారని మాజీ మంత్రి, సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. నెల రోజుల పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. శనివారం ఆయన సెక్రటేరియెట్ లో సీఎం రేవంత్​ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియా పాయింట్ లో మోత్కుపల్లి మాట్లాడారు. భవిష్యత్తులో నూ ఇదే ఒరవడిని కొనసాగించాలని ఆకాంక్షించారు. కాగా,  శనివారం సీఎం రేవంత్​ను మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, హీరో వెంకటేశ్, ప్రముఖ నిర్మాత దుగ్గుబాటి సురేశ్​బాబు జూబ్లీహిల్స్​లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.