బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా బండి సంజయ్

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా బండి సంజయ్

న్యూఢిల్లీ, వెలుగు: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌‌కి హైకమాండ్ అవకాశం కల్పించింది. ఏపీ నుంచి సోము వీర్రాజును నియమించింది. వివిధ రాష్ట్రాలకు చెందిన మాజీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నేతలైన మొత్తం 10 మందిని జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఎంపిక చేసింది. శనివారం ఈ మేరకు బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ ఉత్తర్వులిచ్చారు.

పార్టీ హిమాచల్ ప్రదేశ్‌‌ మాజీ అధ్యక్షుడు సురేశ్ కశ్యప్, బీహార్ మాజీ అధ్యక్షుడు సంజయ్ జైశ్వాల్, పంజాబ్ మాజీ అధ్యక్షుడు అశ్వినీ శర్మ, జార్ఖండ్ మాజీ అధ్యక్షుడు దీపక్ ప్రకాశ్‌‌, రాజస్థాన్ మాజీ అధ్యక్షుడు సతీశ్‌‌ పూనియా, చత్తీస్‌‌గఢ్ సీనియర్ నేత విష్ణుదేవ్ సాయి, రాజస్థాన్ లీడర్ కిరోడీ లాల్ మీనాకు జాతీయ కార్యవర్గంలో చోటు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ ఆదేశాలను ఆయా రాష్ట్రాల ఇన్‌‌చార్జ్‌‌లు, అధ్యక్షులు, సంస్థాగత ఇంచార్జ్‌‌లకు పంపారు.