కేటీఆర్.. మీ నాన్నకు బార్ పెట్టియ్..నువ్వో మసీదు కట్టుకో

 కేటీఆర్.. మీ నాన్నకు బార్ పెట్టియ్..నువ్వో మసీదు కట్టుకో

 మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ లపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ లేకపోతే కేటీఆర్ దేనికి పనికాడన్నారు. కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలోని రైల్వే గేటు ఆర్.వో.బీ పనులను పర్యవేక్షించారు బండి సంజయ్..అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన..    కేటీఆర్ .. మీ నాన్నకో  ఓ బార్ షాప్ పెట్టించి.. నువ్వో మసీదు కట్టుకోవాలని సూచించారు.  కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఫైర్ అయ్యారు.  తెలంగాణలో పది ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మూడో స్థానంలో ఉంటుందన్నారు.

కాంట్రాక్టర్లకు బండి సంజయ్ వార్నింగ్

మార్చిలోపు శనిగరం-కోహెడ రహాదారి పనులు పూర్తిచేయాలని ఆదేశించారు బండి సంజయ్ కుమార్. లేకపోతే కాంట్రాక్టర్లపై కఠిన  చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. కేంద్రం నిధులన్నీ ఇచ్చిన ఎందుకు పూర్తిచేయలేకపోతున్నారని ప్రశ్నించారు. కాంట్రాక్ట్ పనులన్నీ సిండికేట్ గా మారి కొంత మందే చేస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలకు భయపడి ఉండటం వల్లే ఈ పరిస్థితులు వచ్చాయన్నారు.  హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలంలోని తంగళ్ల పల్లిలో రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు ఎంపీ బండి సంజయ్.