శివసేన ఔరంగజేబు సేనగా మారిందన్నారు అమరావతి ఎంపీ నవనీత్ రాణా. ఔరంగజేబు సమాధికి నివాళులర్పించిన వ్యక్తిపై ..సీఎం ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. బాలాసాహెబ్ థాక్రే ఉండి ఉంటే అలా చేసిన వారిని సమాధి చేసేవారన్నారు. ఎన్నికలకు ముందు ఔరంగాబాద్ జిల్లాను షంబాజీ నగర్ గా మారుస్తామన్న శివసేన ఇప్పుడు ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు నవనీత్ రాణా. ఒకవేళ పేరు మారిస్తే..కాంగ్రెస్,ఎన్సీపీలు మద్ధతు ఉపసంహరించుకుంటాయని సీఎం ఉద్ధవ్ థాక్రే భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.