నోట్లపై అంబేద్కర్ ఫోటో పెట్టాలి: ఆర్. కృష్ణయ్య

నోట్లపై అంబేద్కర్ ఫోటో పెట్టాలి: ఆర్. కృష్ణయ్య

కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలంటూ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేపట్టారు. అంబేద్కర్ ఫోటో  సాధన సమితి జాతీయ అధ్యక్షులు జేరిపోతుల పరిశురామ్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో పెట్టేలా పార్లమెంట్ లో కొట్లాడతామని ఆర్. కృష్ణయ్య అన్నారు. 

మరోవైపు కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రణ అంశంపై పార్లమెంట్ లో ఎంపీలుగా కూడా మాట్లాడాలని....లేకుంటే వారి ఇండ్లను ముట్టడిస్తామని జేరిపోతుల పరుశురామ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్‌ ఫొటో సాధన సమితి జాతీయ సలహాదారు ఆళ్ల రామకృష్ణ పాల్గొన్నారు.