కాంగ్రెస్లో చేరిన ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్

కాంగ్రెస్లో చేరిన ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్

బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరాతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ స్టేట్ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో రంజిత్ రెడ్డి, దానం నాగేందర్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. వీరిద్దరికి కండువా కప్పి ఆహ్వానించారు రేవంత్, దీపాదాస్. 

ఇక 100 రోజుల పాలనపై మీట్ ద మీడియా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి... హాట్ కామెంట్స్ చేశారు. చేరికలపై ఇవాళ ఉదయమే రెండు గేట్లు ఎత్తామని చెప్పారు రేవంత్. ఇక నిన్నటి వరకు సీఎంగా పనిచేశానన్న ఆయన... ఇవాల్టి నుంచి పీసీసీ చీఫ్ గా పనిచేస్తున్నానని చెప్పారు.