ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారు

ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారు

హైద‌రాబాద్‌: బీజేపీ అవలంబిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేన‌ని ఎంపీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం గాంధీభ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడుతూ రాజస్థాన్‌లో ఎమ్మెల్యేలను కొని అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. సీబీఐ, ఈడీ ఇన్కమ్ టాక్స్ అధికారులను ఉసిగొల్పి ప్రజాప్రతినిధులను భయబ్రాంతులకు గురి చేస్తోందని మండిపడ్డారు. 31న అసెంబ్లీని ఏర్పాటు చేయాలని..బీజేపీ విధానాలపై శాసన సభలో చర్చించాలని రేవంత్ అన్నారు. ఇవాళ దేశ వ్యాప్తంగా నిరసన చేపట్టామని..కానీ ఎక్కడిక‌క్కడే అరెస్టులు చేస్తున్నారని రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.