ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకియ నాయకులు కోర్టులో స్టే తెచ్చుకోవడం పై గతంలో కేటీఆర్ మాట్లాడిన ఓల్డ్ వీడియోను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తాజాగా కేటీఆర్ కు జన్వాడ ఫాంహౌజ్ కు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులపై మంత్రి కేటీఆర్ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు.
అయితే మంత్రి కేటీఆర్ స్టే తెచ్చుకోవడాన్ని ఎంపీ రేవంత్ రెడ్డి ఎద్దేవాచేశారు. గతంలో కేటీఆర్ ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తప్పుచేసిన వాళ్లే భయపడతారని.. అలాంటి వాళ్లే కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటారని అన్నారు. తప్పుచేయనప్పుడు భయపడాల్సిన పనిలేదని అన్నారు. ఇతరుల విషయంలో అలా మాట్లాడిన కేటీఆర్.. మరి ఇప్పుడు ఆయన ఎందుకు స్టే తెచ్చుకున్నారని రేవంత్ రెడ్డి పరోక్షంగా ప్రశ్నించారు.
Practice what you preach @KTRTRS #ResignKTR pic.twitter.com/ivfdTKdyZe
— Revanth Reddy (@revanth_anumula) June 12, 2020
For More News..