హైదరాబాద్ సిటీ, వెలుగు: ఐఎన్ టీయూసీ అనుబంధ సంస్థ మున్సిపల్ సహకార్ మజ్దూర్ యూనియన్ (ఎంఎస్ఎంయూ) ఆధ్యర్యంలో బుధవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో బోనాల ఉత్సవాలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరై, అమ్మవారిని దర్శించుకున్నారు.
ఎంఎస్ఎంయూ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిల్ షరీఫ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు కొనసాగాయి. ఐఎన్టీయూసీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ సంజీవరెడ్డి, మైనారిటీస్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్ పాల్గొన్నారు.
