మామయ్య బ్లెస్సింగ్స్ తీస్కున్నా

మామయ్య బ్లెస్సింగ్స్ తీస్కున్నా

లక్నో: సమాజ్​వాదీ పార్టీ(ఎస్పీ) వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ నుంచి ఆయన చిన్న కోడలు అపర్ణా యాదవ్ బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ‘‘బీజేపీలో చేరిన తర్వాత లక్నోలో మామయ్య ఇంటికి వచ్చి ఆయన ఆశీస్సులు తీస్కున్నా” అని పేర్కొంటూ ఫొటోను ఆమె శుక్రవారం ట్విట్టర్​లో షేర్ చేశారు. ఎస్పీని వీడిన తర్వాత తొలిసారి ములాయంను కలిసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమెను బీజేపీలో చేరకుండా ఆపేందుకు ములాయం ఎంతో ప్రయత్నించారని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఇదివరకే వెల్లడించారు. బుధవారం ఢిల్లీలో బీజేపీ మెంబర్​షిప్ తీస్కున్న తర్వాత అపర్ణ మొదటిసారి లక్నోకు వచ్చారు. ఆమెకు ఎయిర్​పోర్టులో పార్టీ కార్యకర్తలు గ్రాండ్​ వెల్​కమ్ చెప్పారు.