ములుగు, వెలుగు : ములుగు మున్సిపాలిటీలో మొదటి పాలకవర్గ సమావేశం సోమవారం జరిగింది. కమిషనర్ రమేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో చైర్ పర్సన్ చింతనిప్పుల చంద్రకళ భిక్షపతి మాట్లాడుతూ, ములుగును సర్వాంగ సుందరంగా తీర్చిద్దడంతోపాటు మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కమిషనర్ బడ్జెట్ వివరాలు వెల్లడించారు.
2026-–27 కి గాను మున్సిపాలిటీ మొత్తం బడ్జెట్ రూ.20.72కోట్లుగా నిర్ణయించారు. బడ్జెట్ ద్వారా ములుగు పట్టణంలో పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, రోడ్లు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
