పోకిరీగాళ్లు.. జులాయిగా తిరుగుతూ అమ్మాయిలకు వేధింపులు

పోకిరీగాళ్లు.. జులాయిగా తిరుగుతూ అమ్మాయిలకు వేధింపులు

ముంబైకి చెందిన ఒక మహిళను ఇటీవల నగరంలోని విక్రోలి శివారులో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వేధించారు. ఇది ఆమెను ఎంతగానో బాధించింది. ఈ సంఘటన విఖ్రోలి పార్క్ సైట్ సమీపంలో రాత్రి జరిగింది. ఆ సమయంలో ఆమె తన భర్తతో ఉంది. దీంతో ఇద్దరూ ఈ విషయమై పోలీసులు ఫిర్యాదు చేశారు. జులై 16న ఈ ఘటన జరిగిందని, జూలై 27వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మహిళ ఆరోపించింది.

ప్రాణాలతో బయటపడిన ఆమె.. ఇటీవల సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేసింది. తన కష్టాలను పంచుకుంది. తనను వేధిస్తున్న నిందితుల వీడియో క్లిప్‌ను కూడా పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ముగ్గురు యువకులు బైక్ పై వెళుతూ.. అరుస్తూ కనిపించారు. దంపతులు మొదట తమ నివాసానికి సమీపంలో ఉన్న విక్రోలి పార్క్ సైట్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించారు. అయితే అక్కడి అధికారులు వారిని తిలక్ నగర్ పోలీస్ స్టేషన్‌కు పంపారు. సంఘటన పరిధి అక్కడే ఉందని పేర్కొన్నారు.

తిలక్ నగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఆ దంపతులకు.. త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే, అంతకుముందు ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేసే ప్రక్రియే నాలుగు గంటల పాటు సాగింది. దీంతో ఆ జంట తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎట్టకేలకు, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తెల్లవారుజామున 3 గంటలకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.