రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఇల్లందులో పోస్టల్ బ్యాలెట్ బాక్సులకు అధికారులు సీల్ వేయకపోవడంతో గొడవకు దిగారు అభ్యర్థులు. పలుచోట్ల TRS లీడ్ లో ఉంది. సదాశివపేట 18 వార్డుల్లో TRS లీడ్ లో ఉంది. మరికొన్ని చోట్ల TRS ఏకగ్రీవం అయ్యింది. చెన్నూర్ మున్సిపాలిటీలోని 7వార్డుల్లో TRS ఏకగ్రీవం కాగా.. జవహర్ నగర్ కార్పొరేషన్ డివిజన్ లో TRS ఏకగ్రీవం అయ్యింది.
రామగుండం కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రంలో గొడవ చేశారు. రామగుండం కేంద్రంలోకి వెళ్లిన ఎమ్మెల్యే చందర్.. బయటకు రావాలని అభ్యర్థులు ఆందోళన చేశారు. వరంగల్ నర్సంపేట్ లో ఏడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తిరస్కరణ కాగా.. సదాశివపేట మున్సిపల్ ఎన్నికల్లో 47 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి.
SEE ALSO ఎలా తెరుస్తారని కౌంటింగ్ సెంటర్ దగ్గర గొడవ