జనసేన అభ్యర్థులకు బీఫాంలు.. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన  8 చోట్ల పోటీ

జనసేన అభ్యర్థులకు బీఫాంలు.. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన  8 చోట్ల పోటీ

శామీర్​పేట, వెలుగు: రాష్ట్రంలో ప్రస్తుత, గత పాలకుల పట్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారని జనసేన పార్టీ రాష్ట్ర ఇన్​చార్జీ నేమురి శంకర్ గౌడ్ అన్నారు. జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న అలియాబాద్, మూడు చింతలపల్లి మున్సిపాలిటీల్లో 8 మంది అభ్యర్థులకు సోమవారం తుర్కపల్లిలో ఆయన బీ ఫారాలు అందజేశారు. జనసేన అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని,  ఆయా వార్డుల అభివృద్ధికి పవన్ కల్యాన్​తో మాట్లాడి ప్రత్యేక నిధులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.