హైదరాబాద్‌లో ముస్లింల మిలియన్‌ మార్చ్‌

హైదరాబాద్‌లో ముస్లింల మిలియన్‌ మార్చ్‌

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లోని ముస్లింలు మిలియన్ మార్చ్ నిర్వహించారు. పౌర సవరణ చట్టం (CAA), జాతీయ జనాభా పట్టిక (NPR), జాతీయ పౌర పట్టిక (NRC) లపై వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఇందిరా పార్కు దగ్గర ఉన్న ధర్నా చౌక్‌ లో జరిగే సభకు నగరంలోని పలు ప్రాంతాల నుంచి ముస్లింలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు, నుంచి ట్యాంకు బండ్‌పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ముస్లిం సంఘాల మిలియన్‌ మార్చ్‌కు పోలీసులు షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చారు.