ఈమధ్య ఒకే తరహా సినిమాలు కాకుండా రకరకాల వేరియేషన్స్ చూపించడానికి ఇష్టపడుతున్నాడు నాగచైతన్య. ఆ క్రమంలోనే వెంకట్ ప్రభు డైరెక్షన్లో తన ఇరవై రెండో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. కృతీ శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ ఇటీవలే సెట్స్కి వెళ్లింది. ఇంతలోనే ఒక షెడ్యూల్ కూడా కంప్లీటయినట్టు నిన్న టీమ్ ప్రకటించింది. కొద్ది రోజులుగా మైసూర్లో షూటింగ్ జరుగుతోంది. నాగచైతన్యపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అక్కడి అందమైన లొకేషన్స్లో షూట్ చేశామని టీమ్ చెబుతోంది.
నాగచైతన్య చాలా డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించనున్నాడు. అతని కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమా ఇది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్ రాస్తున్నారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కలిసి సంగీతం అందించడం అన్నిటికంటే పెద్ద విశేషం.