జనసేనలోకి నాగబాబు..నరసాపురం నుంచి పోటీ

జనసేనలోకి నాగబాబు..నరసాపురం నుంచి పోటీ

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ రాజకీయ చేరికలు ఊపందుకున్నాయి. తాజాగా పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు జనసేనలో చేరారు. నాగబాబుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పవన్ కళ్యాణ్ . పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం లోక్ సభ స్థానం నుంచి నాగబాబు పోటీచేస్తారని ట్విట్టర్ లో జనసేన ప్రకటించింది.  గత కొన్ని రోజులుగా జనసేనకు మద్దతుగా టీడీపీ, వైఎస్సార్సీపీలపై నాగబాబు విమర్శలు చేస్తున్నారు . జనసేన పార్టీకి రూ.25 లక్షల విరాళం కూడా ప్రకటించారు. ఇప్పటికే  మెగా ఫ్యామీలీ నుంచి రాంచరణ్ , సాయిథరమ్ తేజ్  జనసేనకు  మద్దతు తెలిపారు.